14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ నుంచి పరుశురామ్ కి లక్కి ఛాన్స్ ?

గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా.. డైరెక్టర్ పరుశురాం తర్వాత సినిమా ఏంటి అంటే ఇంకా ప్రశ్నగానే ఉంది. సినిమా

Update: 2019-12-01 13:59 GMT
parasuram director

గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా.. డైరెక్టర్ పరుశురాం తర్వాత సినిమా ఏంటి అంటే ఇంకా ప్రశ్నగానే ఉంది. సినిమా విడుదలై సంవత్సరం అవుతుంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పరుశురాంకి స్టార్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తారని అందరు అనుకున్నారు. మధ్యలో ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లు వినిపించాయి కూడా .. కానీ అవి కేవలం వార్తల వరకే మిగిలిపోయాయి..

ఈ నేపధ్యంలో పరుశురాంకి 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నుంచి బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య, రష్మిక హీరోహీరోయిన్ గా పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాకి గాను పరశురామ్ కి గాను పరుశురాంకి 14 రీల్స్ వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం... దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.  

Tags:    

Similar News