స్పైడర్ అందుకే ఫ్లాపైంది.. ఎన్టీఆర్కు కథ చెప్పాను కానీ !
డియన్ స్టార్ డైరెక్టర్ లలో మురుగదాస్ ఒకరు .. విభిన్నమైన కథలు చేస్తూ స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలించాడు మురుగదాస్.
డియన్ స్టార్ డైరెక్టర్ లలో మురుగదాస్ ఒకరు.. విభిన్నమైన కథలు చేస్తూ స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలించాడు మురుగదాస్. తాజాగా అయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ అనే సినిమాని తెరకెక్కించాడు. నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి.
విడుదల తేది దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్ర యూనిట్ .. అందులో భాగంగా దర్శకుడు మురుగదాస్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలుగులో మురుగదాస్ చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబు తో స్పైడర్ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
అయితే వీటిపైన మురుగదాస్ స్పందిస్తూ .. ఆ సినిమాలు ప్లాప్ కావడానికి నేనే కారణమని చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్ తెలుసుకోలేకపోయానని, స్పైడర్ విషయంలో మహేష్ను తమిళ ఆడియన్స్కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్ను ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. అన్తేకకుండా త్వరలో తెలుగులో ఓ సినిమాని చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక గతంలో మురుగదాస్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపైన కూడా మురుగదాస్ స్పందించాడు. చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్కు ఓ కథ చెప్పిన మాట వాస్తవమేనని, కానీ ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదని ప్రస్తుతం అయితే ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవమని చెప్పుకొచ్చాడు.