పగలు చిరంజీవి కోసం, రాత్రి రజనీకాంత్ కోసం

తమిళ్ లో పలు విజయవంతమైన చిత్రాలకి దర్శకత్వం వహించి టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Update: 2019-12-23 12:13 GMT
Chiranjeevi, Rajinikanth (File Photo)

తమిళ్ లో పలు విజయవంతమైన చిత్రాలకి దర్శకత్వం వహించి టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు కేఎస్ రవికుమార్. తెలుగులో కూడా ఈ దర్శకుడు పలు చిత్రాలకి దర్శకత్వం వహించారు. తాజాగా బాలకృష్ణతో అయన రూలర్ అనే చిత్రాన్నీ తెరకెక్కించారు. అయితే తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కేఎస్ రవికుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

"మెగాస్టార్ చిరంజీవితో స్నేహంకోసం సినిమా చేస్తున్న సమయంలో నాకు రజినీకాంత్ నుంచి నరసింహా సినిమా ఆఫర్ వచ్చింది. రజినీకాంత్ కోసం చిరంజీవి ఆఫర్ వదులుకోలేను. ఎందుకంటే అప్పటికే చిరంజీవికి నేను మాటిచ్చాను. ఇదే విషయాన్ని రజినీకాంత్ కు చెప్పడంతో ఆయన వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. అలా స్నేహం కోసం సినిమాని చేయగలిగానని" చెప్పుకొచ్చారు.

అలా వారి మధ్య ఉన్న స్నేహంతోనే పగలు చిరంజీవి సినిమా చేస్తూనే, రాత్రి రజనీకాంత్ సినిమాకు డైలాగ్స్ పూర్తిచేసినట్టు వెల్లడించారు. కేవలం నలబై అయిదు రోజుల్లోనే స్నేహంకోసం సినిమా తీశానని, ఆ సినిమా టైమ్ లో వాళ్లిద్దరూ మంచిగా మాట్లాడుకోవడం వల్లనే తన పని ఈజీ అయిపోయిందని ఈ సందర్భంగా వెల్లడించారు కేఎస్.

ఇక రూలర్ విషయానికి వస్తే బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. చిత్ర యూనిట్ కూడా నిన్న సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ నటించారు. జయసుధ, భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రాలలో నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు.  

Tags:    

Similar News