ఏ చిత్ర పరిశ్రమలోనైనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు అంటూ విడిపోవడం సహజమే. అలాగే దర్శకుడు ఏఎల్ విజయ్ను హీరోయిన్ అమలపాల్ 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు... ఆ తర్వాత అమల పాల్ సినిమాలు చేసుకుంటూ ఉంటుంది. ఇక డైరెక్టర్ విజయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా గతం.. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడానికి హీరో ధనుష్ కారణమని దర్షకుడు విజయ్ తండ్రి , నిర్మాత ఏఎల్ అలుగప్పన్ సంచలన ఆరోపణలు చేయడంతో మళ్ళీ ఈ మ్యాటర్ తెరపైకి వచ్చింది.
విజయ్, అమలపాల్ వెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అమలాపాల్ నిర్ణయించుకొంది... అయితే హీరో ధనుష్ తానూ తెరకెక్కించే 'అమ్మ కనక్కు' అనే సినిమాలో అమలాపాల్కు అవకాశం ఇచ్చాడు. ఇది నచ్చక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీనితో ఇద్దరు విడాకులు తీసుకున్నారని అయన వివరించారు. ఇప్పుడు అయన చేసిన ఆరోపణలు కోలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి
2017లో అమలాపాల్తో విడాకులు తీసుకున్న అనంతరం విజయ్ మాట్లాడుతూ .. అమలాపాల్ తన కెరీర్ను కొనసాగించాలని అనుకుంటోందని, తాను, తన కుటుంబం ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని చెప్పుకొచ్చాడు.భార్యాభర్తల మధ్య నిజాయితీ లోపిప్తే ఆ బంధానికి అర్థం లేదని వెల్లడించాడు. ఇక డాక్టర్ ఆర్ ఐశ్వర్య ని 2017లో అయన రెండో వివాహం చేసుకున్నాడు. దీనిపైన అమలపాల్ స్పందించింది. తన మొదటి భర్త చాలా స్వీట్ పర్సన్ అని , విజయ్ - ఐశ్వర్య దంపతులకి చాలా మంది పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.