Kiran Kumar: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్!
బాలీవుడ్పై కరోనా తన ప్రభావం చూపుతుంది. ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన కొందరు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్పై కరోనా తన ప్రభావం చూపుతుంది. ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన కొందరు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ సింగర్ కనిక కపూర్, నిర్మాత కరీం మోరాని ఆయన ఇద్దరు కూతుళ్ళు, విలక్షణ నటుడు ఫ్రెడీ తండ్రి ,బాలీవుడ్ నటుడు సత్య జిత్ తల్లి, బోని కపూర్ ముగ్గురు సహాయకులు కరోనా బారిన పడి పడ్డారు. తాజాగా మరో బాలీవుడ్కు నటుడుకి కరోనా నిర్ధారణ అయింది. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు పొందిన కిరణ్ కుమార్కు కరోనా పాజిటివ్గా వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన కరోనా పాజిటివ్ టెస్ట్లు చేయించుకున్నారు. అందులో భాగంగా ఆయనకి కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయనకి తిరిగి మళ్ళీ మే 25న తదుపరి టెస్ట్ జరగనుంది. ప్రస్తుతం ఆయన తన రెండు అంతస్తుల ఇంట్లో మొదటి అంతస్తులో భార్యాపిల్లలు ఉండగా, పై అంతస్తులో కిరణ్ కుమార్ ఒంటరిగా ఉంటున్నాడని అతని సన్నిహితులు వెల్లడించారు. అయన ఆరోగ్యం ప్రస్తుతానికి పర్వాలేదని , కరోనా లక్షణాలు అభివృద్ధి చెందడం లేదని చెప్పుకొచ్చారు.
కిరణ్ కుమార్ బాలీవుడ్లో విలన్, తండ్రి పాత్రలు ఎక్కువగా పోషిస్తున్నారు. తేజాబ్, ఖుదాగువా, ప్యార్ కియా తో డర్నా క్యా, ముజ్సే దోస్తీ కరోగే వంటి చిత్రాలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి.
ఇక దేశవ్యాప్తంగా కరోనా తన పంజా విసురుతుంది. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,25,101కి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 69,597 మంది చికిత్స పొందుతుండగా, 51, 783 మంది కోలుకున్నారని, 3720 మంది మరణించారని వెల్లడించింది.