వేణుమాధవ్ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మౌలాలీలో జరగనున్నాయి. మరికాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని కాప్రాలోని హెచ్బీ కాలనీ మంగాపురంలో ఇంటికి తీసుకెళ్లనున్నారు. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. వేణుమాధవ్ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వేణుమాధవ్ భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.