గుండెల్ని పిండే పాత్రలో బ్రహ్మీ
నానా పటేకర్ మెయిన్ లీడ్ లో నటించాడు. అయితే తెలుగులో ఆ పాత్రను ప్రకాష్ రాజ్, పోషిస్తున్నారు.
మహాత్మ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణవంశీకి సరైనా హిట్టు అయితే పడలేదు. ఆ తర్వాత అయన చేసిన మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం సినిమాలు అంచనాలకి అందకుండా విఫలం అవుతూ వచ్చాయి. ఇక చాలా గ్యాప్ తీసుకొని తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టాడు కృష్ణవంశీ.. మరాఠిలో మంచి హిట్టైనా 'నట సామ్రాట్' సినిమాని తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
ఒరిజినల్ సినిమాకి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించగా, నానా పటేకర్ మెయిన్ లీడ్ లో నటించాడు. అయితే తెలుగులో ఆ పాత్రను ప్రకాష్ రాజ్, పోషిస్తున్నారు.రమ్యకృష్ణ మరో పాత్రలో కనిపించనున్నారు. ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్రకోసం హాస్యనటుడు బ్రహ్మానందంని ఎంపిక చేసాడట దర్శకుడు కృష్ణవంశీ.. ఈ పాత్ర గుండెల్ని పిండేలా ఉంటుందని కృష్ణవంశీ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Very exhilarating to have the Legendary and Padmasri Brahmanandam Garu in our RANGAMARTHANDA...In a crucial and heart squeezing role .#rangamarthanda pic.twitter.com/ye2pGvrxjc
— Krishna Vamsi (@director_kv) November 23, 2019