వైరల్‌ అవుతున్న కేసీఆర్‌, చిరు ఫోటో.. ఎక్కడ చూసినా ఇదే!

లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో సినీ రంగం ఒకటి.. షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

Update: 2020-05-23 04:18 GMT
CM KCR, Megasrtar Chiranjeevi(File photo)

లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో సినీ రంగం ఒకటి.. షూటింగ్ లు వాయిదా పడ్డాయి.విడుదలకి సిద్దం అయిన సినిమాలు ఆగిపోయాయి. ధియెటర్లు మూతపడ్డాయి. మొత్తానికి సినీ ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం అయితే చూసింది అని చెప్పాలి. తిరిగి మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవాన్ని తీసుకురావలని సినీ పెద్దలు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా మొన్న(గురువారం) జూబ్లిహిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసానితో పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు.

ఇక నిన్న(శుక్రవారం) ప్రగతిభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్‌లకు, ధియేటర్లుకి అననుమతివ్వాలని కోరారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేసీఆర్ లాక్ డౌన్, కరోనా నియమాలను పాటిస్తూ , తక్కువ మందితో ఇండోర్ షూటింగ్ లను చేసుకోవచ్చునని, జూన్ నుంచి షూటింగ్ లను ప్రారంభించుకోవచ్చునని వెల్లడించారు. ఇక దశలవారిగా అవుట్ డోర్ షూటింగ్ , ధియేటర్లకి అనుమతి ఇస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి కలిసి నడిస్తున్న పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు కేసీఆర్ అభిమానులు, ఇటు మెగాస్టార్ అభిమానులు ఈ పిక్ ని చూసి లక్షల సంఖ్యలో షేర్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన అందరికి ఇదే పిక్ దర్శనం ఇస్తుంది. తమ కోరిక మేరకు సినిమా షూటింగ్ లకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చిరు వెల్లడించారు.  

Tags:    

Similar News