సినీ రచయితలు లేకుండా మేము లేము : చిరంజీవి

Update: 2019-11-03 13:16 GMT
chiranjeevi

సినిమా రచయితలు లేకుండా మేము లేమని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.. ఈ రోజు ఫిలిం నగర్ లో తెలుగు సినీ రచయితలు సంఘం రజతోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి చిరంజీవి,మోహన్ బాబు, పరిచూరి బ్రదర్స్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు కోదండ రామిరెడ్డికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానించారు.

అయితే ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, సినిమా దర్శక నిర్మాతలు తర్వాత నేను అత్యధికంగా గౌరవించిచేది, సన్నిహితంగా వుండేది కేవలం రచయితలతోనే నని అన్నారు. సినిమా రచయితలు లేకుండా మేము లేమని చిరంజీవి కొనియాడారు. ఇలా సినీ రచయితలను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. ఇక సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు కూడా వచ్చివుంటే బాగుండేదని కానీ వారు రాలేకపోయారు. భవిష్యత్తులో వారిని సన్మానించుకునే అకవాశం నాకు ఇవ్వగలిగితే బాగుంటుందని చిరంజీవి అన్నారు.  

Tags:    

Similar News