కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సినిమాని ఆఫీషల్ గా అనౌన్స్ చేసారు. పక్కా సోషల్ మెసేజ్ తో ,కమర్షల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు అని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం చిరంజీవి కూడా బాగానే కసరత్తులు చేస్తున్నారు. స్లిమ్ గా అయ్యేందుకు జిమ్ లో బాగానే కష్టపడుతున్నారు.
దేవాదాయ శాఖలో జరుగుతోన్న అక్రమాల చుట్టూ ఈ సినిమా కధ ఉండబోతుందని, ఇందులో చిరంజీవి ఆచార్య అనే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది . అయితే తాజాగా ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. 'గోవింద హరి గోవింద' అనే టైటిల్ను ఖరారు చేసినట్టు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు.
సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ ఇంతవరకు హీరోయిన్ ఎవరు అన్నది ఫిక్స్ అవ్వలేదు. కానీ చిత్ర యూనిట్ త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు వినికిడి.. ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేయనున్నారు. సంగీత దర్శకుడు ఎవరు అన్నది ఇంకా తెలియలేదు .