వేణుమాధవ్ మృతి పట్ల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వేణు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు వేణుమాధవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హాస్యనటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, టీడీపీ ఎన్నికల ప్రచారంలో తనదైన ప్రత్యేక శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు చంద్రబాబు.