అనారోగ్యంతో నిన్న మృతి చెందిన దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాలకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్తో పాటు గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం పార్థీవ దేహం దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవదాస్ కనకాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా ప్రస్ధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు.