బాలయ్యతో సినిమాకి కోటి రూపాయలు డిమాండ్ చేసిన హీరోయిన్ ?

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకిష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకక్కుతున్న సంగతి తెలిసిందే..

Update: 2019-12-21 03:57 GMT

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకిష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల లాగే ఇందులో బాలకృష్ణ కూడా రెండు వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడని వినికిడి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కేథ‌రిన్ థ్రెసా నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కేథ‌రిన్ థ్రెసా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. అంతకుముందు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారానికి తెర దించుతూ నేను ఆ సినిమాలో నటించడం లేదని ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో విలన్ గా హీరో శ్రీకాంత్ నటించనున్నారని తెలుస్తోంది. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకిష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.   

Tags:    

Similar News