బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు అయింది. శ్రీముఖిపై నల్లకుంటకు చెందిన శర్మ అనే ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పలు ప్రోగ్రామ్లకు యాంకర్గా శ్రీముఖి వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజికవర్గాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు శర్మ. శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితో పాటు, ఆ ప్రముఖ ఛానెల్ యాజమాన్యంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఈయన దాంతో వాళ్లపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.