బిగ్ బాస్ మూడవ సీజన్ పదిహేడు మందితో మొదలైన సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇప్పుడు అయిదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఈ సీజన్ విజేత ఎవరు అనేది ఈ వారంలో తెలియనుంది. అయితే అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ను ఫైనల్ ఎపిసోడ్ పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఫైనల్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు హేమను కూడా సంప్రదించారట.. కానీ ఆమె వెళ్ళడానికి ఒప్పుకోలేదట... బిగ్ బాస్ లో ఇప్పటికే జరిగిన అవమానం చాలు అని ఫైనల్ కి రాను అని చెప్పెసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైన క్లారిటీ రావాలంటే మాత్రం మనం షో ఫైనల్ అయిపోయేవరకు వెయిట్ చేయక తప్పదు.