శ్రీదేవికి మరో అరుదైన గౌరవం..మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో..

Update: 2019-09-03 14:22 GMT

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం రూపాంతరం చెందిందని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 4న సింగపూర్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు.



Tags:    

Similar News