పవన్ కళ్యాణ్ సినిమాలో జాన్వీ కపూర్.. ఇదే పర్ఫెక్ట్ ఎంట్రీ అంటున్న బోనీ కపూర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-05-25 05:13 GMT
Pawan Kalyan, Janhvi Kapoor(File photo)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే అయన వరుసపెట్టి సినిమాలకు సైన్ చేశారు. ప్రస్తుతం పవన్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం .. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్,అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఈ సినిమాలో అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయలనీ నిర్మాతల్లో ఒకరైనా బోనీ కపూర్ భావిస్తున్నట్టుగా సమాచారం.. సౌత్ లో పవన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సో ఈ సినిమానే జాన్వీ కపూర్ కి ఫర్ఫెక్ట్ ఎంట్రీ అని బోనీ కపూర్ అనుకుంటునట్టుగా తెలుస్తోంది.. ఇక ఇటు శ్రీదేవి అభిమానులు, తెలుగు సినీ అభిమానులు కూడా శ్రీదేవి కూతురుని తెలుగు వెండితెరపై చూడాలని అనుకుంటున్నారు. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం జూలై సెకండ్ వీక్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుపుకోనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ .. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ సిద్దంయ్యరని తెలుస్తోంది. 

Tags:    

Similar News