ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనిపించింది: బోనీ కపూర్..

Update: 2019-11-04 11:53 GMT
Boney kapoor,pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాని రీమేక్ చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దిల్ రాజులు కలిసి సిద్ధమయ్యారని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..

అయితే, ఈ సినిమాను పవన్‌తోనే ఎందుకు తీయాలని అనుకుంటున్నారు అని మీడియా అడగగా బోనీకపూర్ ఇలా వెల్లడించారు... అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాని తమిళ్ లో అజిత్ తో చేయాలన్నది నా భార్య శ్రీదేవి కల .. అందుకే ఆ సినిమాని తమిళంలో 'నేర్కొండ పార్వాయ్' టైటిల్‌తో రీమేక్ చేశాను. అక్కడ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

దీనితో ఈ సినిమాని తెలుగులో తీస్తే కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అందుకే ఆయనని కూడా ఒప్పించానని బోనీ కపూర్ వెల్లడించారుమ్. తెలుగు ప్రేక్షకులకు నచ్చిన అంశాలతోనే ఈ సినిమాని నిర్మిస్తామని బోనీకపూర్ మీడియాకి వెల్లడించారు..

Tags:    

Similar News