ఆమె కరోనాని జయించింది... ఈమె కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయింది
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది.
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకి కరోనా సోకినట్లు తేలడంతో దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమెను సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందింది. చికిత్సలో భాగంగా ఆమెకి అయిదు సార్లు పాజిటివ్ అని రాగా, ఆరోసారి నెగిటివ్ వచ్చింది. అనంతతం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు..
ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లోని మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. నిర్మాత కరీమ్ మొరానీ కూతురు జోయా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఆల్వేజ్ కభీ కభీ, మస్తాన్, భాగ్ జానీ లాంటి సినిమాల్లో నటించిన జోయా మొరానీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అందులో భాగంగా శ్రీలంకకి వెళ్లోచ్చిన ఆమెకి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెను ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏంటంటే ఆమె అక్క షాజా మొరానీకి కూడా నిన్ననే పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అమెను నానావతి హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇక భారత్ లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా భాదితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు భారత్లో కరోనా వైరస్ వల్ల 117 మంది చనిపోగా, 4421 కేసులు పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.