ఎట్టకేలకు గాయని కనికా కపూర్ కు కరోనా నెగెటివ్!
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది.
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. చికిత్స లో భాగంగా ఆమెకి నాలుగు సార్లు టెస్టు చేయగా అన్ని సార్లు పాజిటివ్ అనే తేలింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇక ఐదోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటీవ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వ్యైదులు వివరించారు.
దీనితో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ.. కనికా దైర్యం కోల్పోకుండా వైద్య సిబ్బందికి సహకరించిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం రిపోర్టులలో నెగిటివ్ అని వచ్చినప్పటికీ మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలో ఉండనున్నారని తెలుస్తోంది. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత 8 రోజులపాటు వైద్యులు టెస్ట్లు చేస్తారు. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్ వస్తే కనికా పూర్తిగా కరోనాపై విజయం సాధించినట్లే అవుతుంది.