పుష్పలో ఐట‌మ్ గ‌ర్ల్ గా స్టార్ హీరోయిన్?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Update: 2020-05-02 09:23 GMT
Disha Patani (File Photo)

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో బన్నీ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక సుకుమార్ సినిమాలో కచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఆయన సినిమాలోని ఐటమ్ సాంగ్స్ అన్ని మంచి హిట్ అయ్యాయి..మొద‌ట్లో డ్యాన్స‌ర్లు, వ్యాంప్ త‌ర‌హా రోల్స్ చేసే వాళ్ల‌తో ఐట‌మ్ సాంగ్స్ ను చేసిన సుకుమార్ ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్స్ తో ఐటమ్ సాంగ్స్ చేయించడం మొదలు పెట్టాడు.. అందులో భాగంగానే సుకుమార్ గత చిత్రం రంగస్థలం సినిమాలో జిగెలు రాణిగా పూజా హెగ్డే కనిపించింది.

ఇప్పుడు పుష్ప సినిమాకోసం ఒక స్టార్ హీరోయిన్ చేత ఐట‌మ్ సాంగ్ చేయించ‌నున్నాడ‌ట‌ సుకుమార్.. ఇంతకీ ఆమె ఎవరు అనే కదా.. మరో ఎవరో కాదు.. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా పాటని.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న దిశా ప‌టానీ 'పుష్ప‌'లో ఐట‌మ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. దీనిపైనే త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.


Tags:    

Similar News