బుట్టబొమ్మ పాటకి బాలీవుడ్ భామ ఫిదా

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' ..

Update: 2020-03-31 08:59 GMT
Disha Patani (File Photo)

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' .. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకి ముందు తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.. ఇక ఆ తరవాత త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఈ సినిమాకి పోటిగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా మంచి పోటి ఇచ్చినప్పటికీ సినిమా మంచి వసూళ్ళను సాధించింది..

ఇక సినిమాలోని పాటలకు బన్నీ చేసిన డాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. సామ‌జావ‌ర‌గ‌మ‌న‌, రాములో రాముల , బుట్ట‌బొమ్మ పాటలకు అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేశాడు. ఇక ఇందులో బుట్టబొమ్మ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా ఈ పాట‌కు టిక్ టాక్ లో డాన్స్ చేయ‌డం అప్ప‌ట్లో సెన్సేష‌న్ అయ్యింది. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామ దిశా పటానీ బుట్టబొమ్మ పాటకి ఫిదా అయిపోయింది. ముఖ్యంగా అందులో వాలు ఉప‌రిత‌లంపై జారుతూ బ‌న్నీ వేసే స్టెప్‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ 'అల్లు అర్జున్ ఇదెలా చేశావు' అని కామెంట్ పెట్టింది.

అయితే దీనిపైన స్పందించిన అల్లు అర్జున్ నేను మ్యూజిక్‌నుప్రేమిస్తాను. మంచి మ్యూజిక్ నాతో డాన్స్ చేయిస్తుంది. మీ ప్ర‌శంస‌ల‌కు థాంక్స్‌ అంటూ పోస్ట్ చేశాడు. తమ అభిమాన హీరో డాన్స్ కి బాలీవుడ్ భామలు సైతం ఫిదా అవుతుండడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.



Tags:    

Similar News