ఇస్మార్ట్ బ్యూటితో బెల్లంకొండ సినిమా షూరు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుబోతున్న సంగతి తెలిసిందే.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో సినిమాని పూజా కార్యక్రమలతో మొదలుపెట్టారు.
ఈ పూజా కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమా మూహర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 6 న నుండి మొదలు కానుంది.. హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్లలో చిత్రీకరణ జరుపుకోనుంది. సమ్మర్ లో సినిమాని విడుదల చేయనున్నారు.
అల్లుడు శీను సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన సాయి శ్రీనివాస్ కి ఆశించిన హిట్లు అయితే రాలేదనే చెప్పాలి. ఇక తమిళ్ లోని రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు అనే పేరుతో రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు.. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా కథలు వింటూ సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథకి ఒకే చెప్పాడు. మరి ఈ కథ బెల్లంకొండకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడలి.