Veera Simha Reddy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'జై బాలయ్య' మాస్ సాంగ్..
Jai Balayya: వయసు పెరిగే కొద్దీ హీరోలకి ఉండే క్రేజ్ తగ్గుతుంటుందని కొందరు అంటారు.
Jai Balayya: వయసు పెరిగే కొద్దీ హీరోలకి ఉండే క్రేజ్ తగ్గుతుంటుందని కొందరు అంటారు. కానీ నందమూరి బాలకృష్ణ విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నందమూరి బాలకృష్ణ "అఖండ" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తాజా సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. హీరో పాత్రను తెలియజేసేలా మాస్ సాంగ్గా దీన్ని చిత్రీకరించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.