అభిమాని మృతి.. విషాదంలో మెగా హీరోలు

సినిమా హీరోలకు, అభిమానులకి మధ్య ఉన్న బంధాన్ని వర్ణించలేము. ఎలాంటి సంబంధం లేకున్నా సరే అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తారు.

Update: 2019-12-08 06:29 GMT
అభిమాని నూర్‌ బాయ్‌

సినిమా హీరోలకు, అభిమానులకి మధ్య ఉన్న బంధాన్ని వర్ణించలేము. ఎలాంటి సంబంధం లేకున్నా సరే అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తారు. అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు ధియేటర్ ని అందంగా ముస్తాబు చేసి కళకళాడిస్తారు. సినిమా ధియేటర్ నుండి పోయే వరకు అన్ని దగ్గరుండి మరి చూసుకుంటారు. ఇలాంటి అభిమానులు మెగా హీరోలకి చాలా మంది ఉన్నారు. అలాంటి అభిమానుల్లో నూర్‌ బాయ్‌ ఒకడు. అతి ముఖ్యమైన అభిమాన సంఘం నాయకుడు అయిన నూర్‌ బాయ్‌ కన్నుమూసాడు. దీనితో మెగా హీరోలు విషాదంలో మునిగిపోయారు..

ఈ నేపధ్యంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' చిత్ర టీజర్‌ ను వాయిదా వేసింది. చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైనా గీతా ఆర్ట్స్‌.. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించింది. తమ కుటుంబసభ్యుడిగా భావించే అభిమాని మృతి చెందడడంతో టీజర్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 'మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ఓ అభిమాని మృతి చెందారు. నూర్‌ బాయ్‌ మా అందరికీ ఓ కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి. ఇలాంటి ఉహించని పరిణామాల వల్ల సినిమాకు సంబంధించి విశేషాలను తెలియచేయడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నాం' త్వరలోనే సినిమా టిజర్ ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది..



Tags:    

Similar News