బాగుమతి సినిమా తర్వాత అనుష్క తెలుగు తెరపై కనిపించింది లేదు. తాజాగా అనుష్క నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమాకి మంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే ఓ మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఇదే విషయాన్ని ' నిశ్శబ్దం సినిమా పోస్టర్పై ఉంచుతూ "సాక్షి, ఏ మ్యూట్ ఆర్టిస్ట్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాలో షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.