డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. మరో వివాదంలో చిక్కుకున్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ హైదరాబాద్లో హల్చల్ చేశారు. పైగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి.. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్కి ట్రిపుల్ రైడింగ్లో వచ్చి.. సినిమా చూశారు. ఇప్పుడిది కాస్తా వైరల్గా మారింది.
రాంగోపాల్ వర్మ ట్రిపుల్ రైడింగ్పై ట్రాఫిక్ పోలీసులు.. సీరియస్ అయ్యారు. వర్మ ఓవర్ యాక్షన్కు ట్రాఫిక్ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. వెయ్యి 335 రూపాయల చాలన్ విధించారు. ఇదే కాదు.. ఇస్మార్ట్ శంకర్.. సినిమా సక్సెస్ పార్టీలో టీమ్తో కలిసి.. వర్మ మందేసి చిందేశారు. చార్మి, పూరీని హగ్ చేసుకుని.. ముద్దులు కూడా పెట్టుకుని రచ్చరచ్చ చేశారు.