గీతామాధురి డైలాగ్ ని వాడేసిన అనిల్ రావిపూడి

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'

Update: 2020-01-07 06:05 GMT

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి విడుదలకి సిద్దం అయింది. ఈ సినిమాని ఈ నెల 11 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ , సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ఎల్బీ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. అందులో భాగంగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. అయితే ఈ ట్రైలర్ లో హీరోయిన్ రష్మిక ఓ మ్యానరిజంతో కనిపిస్తుంది. హీరోయిన్ రష్మిక నోటికి చేయిని అడ్డంగా పెట్టుకొని 'నీకు అర్థమౌతోందా' అంటూ కనిపిస్తుంది. ఈ డైలాగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. అయితే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.

సహజంగా అయితే ఈ డైలాగ్ దొరకడం చాలా కష్టమే.. కానీ తెలుగు బిగ్ బాస్ షో చూసిన వారికీ మాత్రం ఈజీగానే పట్టేస్తారు. ఈ డైలాగ్ అన్నీ బిగ్ బాస్ సీజన్ 2 లో రన్నరప్ టైటిల్ కొట్టిన సింగర్ గీతామాధురిదే నని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ సీజన్ లో గీతామాధురి 'నీకు అర్ధమౌతోందా' అనే పదాన్ని బాగా వాడడంతో అదే ఆమెకి ఊతపదంగా మారిపోయింది.. ఆ తర్వాత ఫేమస్ అయింది. ఇప్పుడు ఇదే ఊతపదాన్ని హీరోయిన్ రష్మికకి సినిమాలో వాడాడు దర్శకుడు అనిల్ రావిపూడి.. సినిమా మొత్తం ఇదే డైలాగ్ తోనే కనిపిస్తుంది రష్మిక ..

ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో లేడి అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. ప్రొఫెసర్ భారతి రోల్ లో ఆమె కనిపించనున్నారు. సంగీత, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి సినిమా అనిపించుకుంటుందో చూడాలి మరి. 

Tags:    

Similar News