అభిమానుల అకౌంట్స్ బ్లాక్ చేసిన అనసూయ.. కారణం ఇదే!

యాంకర్ అనసూయ తనని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న అభిమానులు అకౌంట్స్ నీ బ్లాక్ చేసింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు.

Update: 2020-03-23 12:42 GMT
Anasuya Bharadwaj (file photo)

యాంకర్ అనసూయ తనని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న అభిమానులు అకౌంట్స్ నీ బ్లాక్ చేసింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు.. కరోనా వైరస్ ప్రభావం వలన మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందిపడుతోన్న సామాన్యులకు రూ.1500 ఆర్థికసాయం కింద అందచేయనున్నట్లు కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు..

అయితే దీనిపైన అనసూయ స్పందిస్తూ.. "లాక్ డౌన్ ఓకే కానీ మేం పని కోసం బయటకు వెళ్లకపోతే, డబ్బులు సంపాదించుకోలేం. ప్రతి నెల మేం ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కట్టుకోవాలి. కాస్త ఈ కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది" అంటూ ఓ ట్వీట్ చేసింది.. దీనితో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బ్యాంకు బాలన్స్ ఉంది నువ్వే ఇలా మాట్లాడితే పేదవాళ్ళ సంగతి ఏంటి? అని కామెంట్ చేస్తున్నారు..


అయితే తను తన కోసం చెప్పలేదని, కొంతమంది పేదవాళ్లను ఉద్దేశించి "మేము" అనే పదాన్ని వాడానని అనసూయ వివరణ ఇచ్చుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ట్రోలింగ్ ఆగలేదు. దీంతో కొన్ని ఎకౌంట్స్ ను ఆమె బ్లాక్ చేయాల్సి వచ్చింది. నిన్నటి నుంచి ట్విటర్‌, ఇన్‌స్టాలో అకౌంట్స్‌ బ్లాక్‌ చేసి చేసి వేళ్లు నొప్పిపుడుతున్నాయంటే నమ్మండి.. తప్పదు కదా.. నా పేజ్‌లో వాళ్ల బుర్రలేనితనం ఏంటి.. నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకుని.. దూరంగా పెడుతున్నా." అంటూ మరో ట్వీట్ చేసింది అనసూయ.


Tags:    

Similar News