వైఎస్ భారతితో నమ్రత భేటి ... ఎందుకంటే ?

Update: 2019-10-25 09:36 GMT

హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతితో భేటి అయ్యారు. శ్రీమంతుడు సినిమా అనంతరం హీరో మహేష్ తన సొంత గ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి వైఎస్ భారతితో నమ్రత చర్చించారు.

ఇప్పుడు ఆ గ్రామానికి ప్రభుత్వం, గ్రామం ఫౌండేషన్ కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని నమ్రత వైఎస్ భారతిని కోరినట్టు సమాచారం.. మహేష్ బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవడాన్ని వైఎస్ భారతి అభినందించారు.. ఇక వైఎస్ భారతిని కలిసే ముందు నమ్రత విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. 



 


Tags:    

Similar News