పాలకొల్లు నుండి పద్మశ్రీ వరకు మా తాత ప్రయాణం అద్భుతం
అయన మనవడు, సినీ హీరో అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో తన తాతకి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
అల్లు రామలింగయ్య అంటే తెలియని వారు ఉండరు. మూడు తరాల సినీ ప్రేక్షకులను తనదైన హాస్యంతో మెప్పించారు అయన.. పాలకొల్లులో జన్మించిన అయన సినిమా రంగంలో రాణించి, సినిమా పరిశ్రమకి ఎంతో కృషి చేసి పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు.
అయితే అయన మనవడు, సినీ హీరో అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో తన తాతకి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అల్లు రామలింగయ్య పద్మశ్రీ అవార్డు అందుకొని తిరిగి వచ్చిన సమయంలో ఆయన తన మనవలు, మనవరాళ్లతో కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోలో అల్లు అర్జున్ తన తాత కుడి చేతికింద దండ వేసుకొని ఉన్నాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ అల్లు అర్జున్ "పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు ఆయనది అద్భుతమైన ప్రయాణం" అంటూ కామెంట్ పెట్టాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12 న విడుదల చేయనున్నారు.