అల వైకుంఠపురములో సెకండ్ డే కలెక్షన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం భారీ అంచానాల మధ్య
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం భారీ అంచానాల మధ్య జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హేగ్దే కథానాయకగా నటించిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్ని, అల్లు అర్జున్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకి తగ్గట్టుగానే సినిమా విడుదలైన అన్ని ధియేటర్ల నుంచి సినిమాకి మంచి స్పందన వచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. తోలిరోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 30 కోట్లు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. ఇక రెండో రోజు సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నిజాం: 10.05 కోట్లు
సీడెడ్ : 5.19 కోట్లు
నెల్లూరు : 1.62 కోట్లు
కృష్ణ: 3.97 కోట్లు
గుంటూరు : 4.21 కోట్లు
వెస్ట్ గోదావరి : 3.26 కోట్లు
ఈస్ట్ గోదావరి : 4.19 కోట్లు
ఉత్తరాంధ్రా: 4.38 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.36.87కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకి మొత్తం రూ.85 67.05 కోట్ల థియెట్రికల్ బిజినెస్ జరిగిందని అంచనా..
ఈ సినిమాలో జయరాం, టబు, సునీల్, నివేతా పెతురాజ్, సుశాంత్, నవదీప్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించారు. పి యస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.