హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో భాదపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.. అయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు సినీ నటులు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అయనతో ఉన్నా వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ నేపద్యంలో ప్రముఖ యాంకర్,నటి ఉదయభాను అయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి కన్నీరు ఆపుకోలేక పోయింది.
ఆ తర్వాత ఉదయభాను మాట్లాడుతూ "వేణుమాధవ్ నాకు పెద్దన్నయ్య లాంటి వారు.నన్ను ఒక చెల్లలు లాగా చూసుకున్నారు. ఇద్దరం కలిసి వన్స్ మోర్ ప్రోగ్రాం చేసాం. అప్పుడు సెట్లో బాగా అల్లరి చేసేవాళ్ళం. అయన ఇంటినుండి వచ్చే క్యారేజ్ ని షేర్ చేసుకునేవాళ్ళం. చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరిని నవ్విస్తూ ఉండేవాడు. వేణుమాధవ్ లాంటి ఆర్టిస్ట్ మళ్ళీ పుట్టరు. ఎవరికేమైనా అయ్యింది అంటే వెంటనే చలించే బంగారం లాంటి మనిషి... ఎప్పటినుండో ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూనే ఉన్నాం కానీ ఇంతలోనే ఇలా జరగడం భాదాకరం" అంటూ ఉదయభాను కన్నీరు పెట్టుకున్నారు.
ఇక వేణుమాధవ్ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు.