దర్శకుడు వివి వినాయక్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం వినాయక్ చాలా కష్టపడి బరువు తగ్గారు. అయితే ఈ సినిమాని వినాయక్ పుట్టినరోజు అయిన అక్టోబర్ 9న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి శ్రియ నటిస్తుందని సమాచారం . దీనిని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది . గతంలో వినాయక్ దర్శకత్వంలో శ్రియ చెన్నకేశవరెడ్డి ,ఠాగూర్ సినిమాల్లో నటించింది.