ఆఫీషియల్ : రజీనికాంత్ తో కీర్తి సురేష్
'నేను శైలజ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది నటి కీర్తి సురేష్ .. మొదటి సినిమాతోనే మంచి నటి అని నిరూపించుకుంది. ఆ తర్వాత హీరో నానితో
'నేను శైలజ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది నటి కీర్తి సురేష్ .. మొదటి సినిమాతోనే మంచి నటి అని నిరూపించుకుంది. ఆ తర్వాత హీరో నానితో చేసిన నేను లోకల్ లో ఆదరగోట్టింది. ఇక మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా అనంతరం కథల ఎంపికలో జాగ్రత్తలు వ్యవహరిస్తుంది. ఇప్పుడు రెండు సినిమాలలో నటిస్తుంది కీర్తి. తెలుగులో మిస్ ఇండియా, తమిళంలో పెన్గ్విన్ చిత్రాల్లో నటిస్తుంది .
ఇది ఇలా ఉంటే రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమాలో కీర్తి సురేష్ నటిస్తునట్టు గత కొద్దీ రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైనా ఇంతవరకు కీర్తి కానీ అటు చిత్ర యూనిట్ కానీ స్పందించింది లేదు. తాజాగా ఇటు చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా ఈ విషయాన్నీ ప్రకటించింది. అటు కీర్తి కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించింది. " ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రజినీ సార్ ని కలవడమే పెద్ద విషయం. కానీ ఇప్పుడు అయనతో కలిసి నటించడం నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమని పేర్కొంది. ఇందులో కీర్తి రజనీ కూతురుగా నటిస్తుంది.
ఈ సినిమాని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇందులో రజినీకాంత్ రెండు పాత్రలలో నటిస్తారని సమాచారం. ఇందులో రజినీకి జోడిగా కుష్బూ నటిస్తుండగా మీనా మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రజినీ నటించన దర్బార్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మురగదాస్ దర్శకత్వం వహించాడు.
Extremely happy to announce this magical milestone in my journey .
— Keerthy Suresh (@KeerthyOfficial) December 9, 2019
From being awe struck of @rajinikanth sir to sharing screen space with him will be my most cherished memory in my life. Thank you @directorsiva sir @sunpictures 😊🙏🏻#Thalaivar168