Indian 2 Accident: తృటిలో ప్రాణలతో బయటపడ్డ కమల్, కాజల్
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్ 2'.. అయితే ఈ సినిమా సెట్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్ 2'.. అయితే ఈ సినిమా సెట్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం రాత్రి షూటింగ్ స్పాట్లో క్రేన్ కింద పడటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో పది మందికి గాయాలు అయ్యాయి. దర్శకుడు శంకర్ కూడా గాయపడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపైన హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందించింది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..
అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు కాజల్, కమల్ హసన్ అక్కడే ఉన్నారట! తృటిలో వీరు తమ ప్రాణాలను దక్కించుకున్నారట.. ఈ విషయంపైన కాజల్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... "ఈ ఘటనపై నేను ఎంతో బాధపడుతున్నాను. ఈ సంఘటన వల్లన నేను నా ముగ్గురు కొలీగ్స్ను కోల్పోయాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగిన ఈ సంఘటన వల్లన సమయం, జీవితం గురించి పెద్ద గుణపాఠాలే నేర్చుకున్నాను" అని ట్వీట్ చేసింది.
In so much shock, denial, trauma from the monstrous crane accident last night. All it took was a fraction of a second to stay alive and type this tweet. Just that one moment. Gratitude. So much learning and appreciation for the value of time and life. 🙏🏻🙏🏻🙏🏻
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 20, 2020
ఇక ఇదే విషయం పైన నటుడు కమల్ హసన్ కూడా స్పందించాడు. నా సినీ జీవితంలో నేను చూసిన అత్యంత భయంకరమైనది నేటి ప్రమాదం. నేను ముగ్గురు సహోద్యోగులను కోల్పోయాను, కాని వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారి దుఖంతో పోల్చితే నా బాధ మరింతగా పెరుగుతుంది. వారికి నా ప్రగాడ సానుభూతి." అంటూ ట్వీట్ చేశారు కమల్..
శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996 లో వచ్చిన హిట్ చిత్రం భారతీయుడుకు.. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. సంవత్సరం క్రితం సినిమా ప్రారంభం అయింది. కానీ షూటింగ్ మాత్రం సీరియస్ గా జరగడం లేదు. అయితే ఈ నెలలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేశారు. షూటింగ్ వేగం పుంజుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చిత్ర బృందానికి షాక్ కలిగించింది. కాగా ఈ సినిమా కోసం కమల్ ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చారు. సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఈవీపీ ఫిల్మ్ సిటీలో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. నటుడు విజయ్ బిగిల్ షూట్ సమయంలో, ఒక క్రేన్ పైన ఫోకస్ లైట్ అతనిపై పడటంతో ఒక వృద్ధ ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు