కరోనా మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది పెళ్లిళ్ల ముచ్చట్లన్నీ బంద్ అయ్యాయి. కొడుకును ఒక ఇంటివాడిని చేయాలని... కూతురును ఒక అయ్య చేతిలో పెట్టాలని అనుకున్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఈ నెల, వచ్చే నెలల్లో జరగాల్సిన వేలాది పెళ్లిళ్లు, ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు మాత్రం.. అటువైపు, ఇటువైపు కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో సాదాసీదాగా కళ్యాణాలు కానిచ్చేస్తున్నారు. వైభవంగా పెళ్లి జరుపుదామనుకున్న వారి ఆశలపై లాక్డౌన్ నిబంధనలు నీళ్లు చల్లేశాయి. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా నితిన్ పెళ్లి వాయిదా పడింది. డాక్టర్ పల్లవి వర్మ తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
అయితే ముందుగా నితిన్ పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా ఒకసారి వాయిదా పడింది. దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మే 14న పెళ్లి చేసుకుంటామని ఇరువురు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐతే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ 17 వరకు ఉంది. కాకపోతే నిన్న మోదీ లాక్డౌన్ 4 సంకేతాలు ఇవ్వడంతో ఇప్పట్లో ఘనంగా పెళ్లి జరుపుకునే ఛాన్స్ లేదని భావించిన నిఖిల్ ముందుగా పెట్టిన ముహూర్తానికే కొద్ది మంది సభ్యుల మధ్య పెళ్లి చేసుకోనున్నాడట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.