సైరా భారీ బడ్జెట్ తోనే కాదు, భారీ అంచనాల మధ్య విడుదలైంది... చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. సినిమాకి ప్రేక్షకుల నుండి మాత్రమే కాదు.. సినీ తారల నుండి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్ లో థాంక్యు మీట్ ని ఏర్పాటు చేసారు. సినిమా సక్సెస్ కావడంతో సినిమా కోసం పడ్డ కష్టాన్ని మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమాలో నటించిన బ్రహ్మాజీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ముందుగా సినిమాలో చిన్న పాత్ర అయిన సరే చిరంజీవి పక్కన నటించే అవకాశాన్ని ఇవ్వమని చిత్ర నిర్మాత రామ్ చరణ్ ని అడిగాను. కానీ అయన సినిమాలో ఎక్కువ సేపు నిడివి ఉండే పాత్రను ఇస్తారని అనుకోలేదు. రామ్ చరణ్ కి, దర్శకుడు సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు అని తెలుపుతూ సినిమాకి సంబంధించిన ఫొటోస్ ని పోస్ట్ చేసాడు బ్రహ్మాజీ ...ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం బ్రహ్మాజీ ఏకాంగా గుండు కొట్టించుకొని మరి నటించారు. బ్రహ్మాజీ ఇందులో వడ్డే ఓబన్న పాత్రలో నటించారు.
ఇక సైరా సినిమాని రామ్ చరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ , జగపతిబాబు,తమన్నా,కిచ్చా సుదీప్, విజయ సేతుపతి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
Requested Ram Charan garu to give me an opportunity to work with mega star in #SyeRaa .. never imagined it to be a full length role.. ever greatful 🙏🏼🙏🏼.. Nd can't thank enough @DirSurender @RathnaveluDop for ur support 🙏🏼.@KonidelaPro 🙏🏼 pic.twitter.com/jKqRYCZdj3
— BRAHMAJI (@actorbrahmaji) October 4, 2019