అమృత, ప్రణయ్‌‌ లవ్ స్టొరీపై సినిమా..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినా ప్రణయ్‌ హత్యకేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.. తన కూతురు అమృత

Update: 2020-03-09 17:33 GMT
అమృత, ప్రణయ్‌‌

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినా ప్రణయ్‌ హత్యకేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.. తన కూతురు అమృత, ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ హత్యచేయించాడు. ఆ తర్వాత మారుతీరావు జైలుకి వెళ్ళడం, అమృత మగబిడ్డకు జన్మనివ్వడం, దీనిపైన కోర్టులో కేసు నడవడం జరిగింది. అంతా ఒకే అనుకున్న క్రమంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకోవడంతో మరో సారి ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది..

అయితే ఇప్పుడు అమృత, ప్రణయ్‌‌ ప్రేమకథపై ఓ సినిమా రూపొందుతుంది. వీరి ప్రేమకథ స్పూర్తితో నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' అనే సినిమా తెరకెక్కింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలాదిత్య, అర్చన కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో జమున, అన్నపూర్ణలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మాస్టర్ రవితేజ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు..

అయితే దీనిపైన హీరో బాలాదిత్య మాట్లాడుతూ.. సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగేశ్వరరావు ఎంతో హార్ట్ టచ్చింగ్‌ అండ్ ఎమోషనల్‌గా తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశామని, సినిమాని ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని బాలాదిత్య వెల్లడించాడు. బాలాదిత్య బాల నటుడిగా అందరికి సుపరిచితుడే.. దాదాపుగా 40 సినిమాల్లో నటించాడు. 

ఇక ఇది ఇలా ఉంటే మారుతీరావు అంత్యక్రియలు ఈరోజు మిర్యాలగూలో నిర్వహించారు. తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లిన కూతురు అమృతకు నిరాశే మిగిలింది. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృతపై మారుతీరావు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత గో బ్యాక్ అంటూపెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. దీంతో ఆమె తండ్రి మృత దేహన్ని చూడకుండానే వెనుతిరిగిపోయింది. 

Tags:    

Similar News