బంపర్ ఆఫర్ : రూ. 2799లకే రెడ్‌మి నోట్‌ 6ప్రొ..

Update: 2019-01-11 13:08 GMT

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమి మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.13,999 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉన్న షావోమి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ను కేవలం ధర రూ.2799 లకే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ను షో రూమ్ లో కాకుండా ఫ్లిప్‌కార్ట్‌ లోనే కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది.ఈ మేరకు ఎంఐ ఇండియా ట్విటర్‌లో ట్వీట్ చేసింది. అయితే ఈ ఫోన్ ను పరిమితకాల ఆఫర్‌గా అందిస్తున్నట్టు షావోమి వెల్లడిస్తోంది. అలాగే కొన్ని కండిషన్స్ కూడా జతజేసినట్టు తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ లో మాత్రం రెడ్‌మి నోట్‌ 6 ప్రొ నే కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే హై5 పేరుతో తన స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్న షావోమి తాజాగా రెడ్‌మి 6పై భారీ తగ్గింపు ప్రకటించి వినియోగదారులను ఆకర్షించింది.

Similar News