త్వరలో కేసీఆర్ ఏపీకి వెళ్ళి జగన్‌తో చర్చిస్తారు : కేటీఆర్

ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీ అధినేత జగన్‌తో మరిన్ని చర్చలు ఉంటాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Update: 2019-01-16 10:28 GMT

ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీ అధినేత జగన్‌తో మరిన్ని చర్చలు ఉంటాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ త్వరలో ఆంధ్ర ప్రదేశ్‌ వెళ్ళి స్వయంగా జగన్‌తో చర్చిస్తారని ప్రకటించారు. లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన కేటీఆర్ బృందం ఫెడరల్ ఫ్రంట్‌తో పాటు ఏపీ, తెలంగాణ సమస్యలపై చర్చించారు. లంచ్ తర్వాత జగన్, కేటీఆర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఒకే ఆలోచనతో ఉన్నవారు కలసి వస్తారనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. 

Similar News