'ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్చమని కోరాం'

Update: 2019-03-28 09:37 GMT

వైసీపీ నేతలు మరోసారి కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిశారు. ఏపీలో అధికారులు వ్వహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందచేశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను విధుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోనందున మరోసారి కలిశామని ఆ పార్టీ నేతలు చెప్పారు. టీడీపీకి అనుకూలంగా పని చేసే విధంగా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపధ్యంలో పోలీసు వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీకి కేంటాయించిన హెలిక్యాప్టర్ గుర్తును మార్చమని కోరారు.  

Similar News