దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుతూరు వైయస్ సునీత పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి పులివెందుల పోలీసు స్టేషన్లో పోలీసులకు తన తండ్రి హత్యకు గల కారణాలపై లోతుగా విచారణ జరిపించాలన్నారు. అనంతరం వైయస్ సునీత మీడియాతో మాట్లాడుతూ మా నాన్న రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని నిన్న కూడా కడప జిల్లా చాపాడు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపింది. కేవలం మా నాన్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని మా నాన్నని హత్య చేశారని అనుమానిస్తున్నాం అని వైయస్ సునీత పేర్కొన్నారు.