నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి రోజే కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. తన సలహాదారులను నియమించుకోవడంతోపాటు వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 1 నుంచి శాఖలవారీగా సమీక్షలు చేయనున్న జగన్ పోలవరంపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే నాడు వైఎస్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇదే బాటలో నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం నవరత్నాలపై పెట్టబోతున్నట్లు తెలిసింది.
నవరత్నాలు ఇవే ..
1.వైఎస్ఆర్ రైతు భరోసా
2.ఫీజు రీయింబర్స్మెంట్
3.ఆరోగ్యశ్రీ