భారత వాయుసేనకు చెందిన మిగ్-21 ఫైటర్జెట్ను తాము కూల్చివేసినట్లు ప్రకటించిన పాకిస్థాన్ ఆర్మీ, ఆ ఫైటర్ పైలట్ను కూడా అదుపులోకి తీసుకుని ఆ పైలట్కు సంబంధించిన విడియో ఒకటి విడుదల చేసి, చిత్ర హింసలు పెట్టిన విషయం తెలిసిందే కదా అయితే . ఇప్పడు పాక్ కబంధ హస్తాల్లో ఉన్న విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్కి తిరిగి రావాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ పరిస్థితిల్లో అభినందన్ కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. తను క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.