వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. ఏపీలో ఓట్ల తొలగింపు, జాబితాల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, వరప్రసాద్, బాలశౌరి, ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు.