సీఎం ఆశయాలకు అనుగుణంగా అధికారులంతా సిద్ధం: సీఎస్

Update: 2019-06-08 05:39 GMT

రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉందన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. నేడు ఏపీ సీఎం హోదాలో జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం సీఎస్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులున్నారని ఆయన తెలిపారు. 

Tags:    

Similar News