ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ అర్థిక మంత్రి చిదంబరం మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోతామనే భయంతోనే తామేదో సాధించామంటూ మోడీ ప్రతిరోజూ గొంతు చించుకుంటున్నారని వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ పదేపదే 'సొంత బాకా' వాయిస్తున్నారని. నిజానికి ఐదేళ్ల పాలనలో ఆయన సాధించినదేమీ లేదని ఓ ట్వీట్లో చిదంబరం అన్నారు. ఏం సాధించారని మోడీ ప్రతిరోజూ దేశమంతా చుట్టేస్తూ జబ్బలు చరుచుకుంటున్నారు. అధికారం కోల్పోతామనే భయమే ఆయన చూపిస్తున్న డాంబికానికి కారణం' అని పేర్కొన్నారు. మైనారిటీలు, గిరిజనులు, రచయితలు, కళాకారులు, ఎన్జీవీలు తదితరుల్లో అభద్రతాభావం వంటివి మీరు సాధించిన నిజమైన విజయాలు. దయఉంచి వీటిపై మాట్లాడతారా' అని మరో ట్వీట్లో మోదీని చిదబరం ప్రశ్నించారు.