చంద్రబాబు- వైఎస్ జగన్ పర్యటనల రద్దు..! అసలు ఏపీలో ఏం జరుగుతోంది.?
జగన్, కేటీఆర్ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ చర్చల తర్వాత, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు.
జగన్, కేటీఆర్ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ చర్చల తర్వాత, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు. అటు కుటుంబ సభ్యులతో ఇవాళే, లండన్ వెళ్లాల్సిన వైసీపీ అధినేత జగన్, తన టూర్ణు క్యాన్సిల్ చేసుకున్నారు. అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాను, సడన్గా బదిలీ చేయడం కూడా హాట్ టాపిక్గా మారింది. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్న చంద్రబాబు, జగన్లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని, ఇరువురు నాయకులు ఆలోచిస్తున్నారు. నిన్న పొద్దున్నుంచి, అర్థరాత్రి వరకు చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సమాలోచనలు జరిపారు. ఇవాళ కూడా మంతనాలు సాగిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా, తన విదేశీ పర్యటన రద్దు చేసుకుని, అభ్యర్థుల వడపోతపై దృష్టిపెట్టారు. అందరికంటే ముందే ప్రకటించి, రేసులో నిలవాలని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను, అందరికంటే ముందే ప్రకటించి విజయబావుటా ఎగరేశారు కేసీఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార, విపక్ష నేతలు కూడా ఇదే ఫార్ములా ఫాలో కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఫారెన్ టూర్లను సైతం వాయిదా వేసుకుని, గెలుపు గుర్రాలను ఫైనల్ చేసి, వారి పేర్లను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.