ఐటీ గ్రిడ్ దర్యాప్తుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు . ఏ నేరం చేయకపోతే ఈ ఉలికి పాటు ఎందుకంటూ ప్రశ్నించారు. కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారంటూ నిలదీశారు. డేటా దొంగతనం బయటపడుతుందనే కాదా మీ భయం చంద్రబాబు గారంటూ ట్వీట్ సంధించారు . ఏపీ ప్రభుత్వ తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఉందన్న ఆయన నేరం బయటపడుతుందని తెలిసి ఈ ఏడుపులు ఎందుకంటూ ప్రశ్నించారు .